ఐరాస పతాకం pc Wikipedia విశ్వ మానవాళి శ్రేయస్సుకోసమే ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. కాని బహుళజా సంస్థలు దాని పాత్రను భ్రష్టు పట్టించే ప్రమాదముంది. 1970 మధ్య దశకం నుండి కార్పొరేట్ సంస్థలు ఐక్యరాజ్యసమితి పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. 1975 నుండి 1992 వరకు బహుళజాతి సంస్థలకు నిబంధనావళిని రూపొందించే విషయమై ఐక్యరాజ్యసమితిలో అనేకమార్లు చర్చ జరిగింది. 1992 నాటికి కార్పొరేట్ సంస్థలు మరింత బలపడడంతో నిబంధనావళి చర్చలకు తెరపడింది. ఎనలేని అధికారాలను, పలుకుబడిని సంతరించుకున్న బహుళజాతి సంస్థలు తమ కార్యకలాపాలను నియంత్రించేందుకు నియమావళి అంటూ ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్యసమితిని బుజ్జగించాయి. బహుళజాతి సంస్థలపై ఐరాస కేంద్రం 1974లో ఏర్పాటైంది. వాణిజ్య వ్యవహారాలపై కేంద్రం ఐరాస ప్రధాన కార్యాలయం నుండి నిఘా వేసి ఉండేది. అన్ని దేశాలకు చెందిన కార్పొరేట్ సంస్థలకు ఒక నియమావళి ఏర్పాటు చేసి, అతిధేయ దేశాల ప్రయోజనాలు కాపాడాలని, పేద దేశాల బేరమాడే సామర్థ్యాన్ని పెంచాలని, జాతీయ అభివృద్ధి లక్ష్యాల్లో అంతర్భాగంగా బహుళజాతి సంస్థలు నడుచుకునేలా చూడాలని బరాసు కే...
కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు. పేదలకు అప్పులు తీరడం, దున్నుకోడానికి భూమి దొరకడం లాంటి సమస్యలు మౌలికమైనవే. అయితే వారికి మానసిక వికాసం కల్గించవలసిన అవసరం లేదని శుంఠవాదనలు చేసేవారు లెనిన్ కాలంలో కూడా కొందరుండేవారు. ఇలాంటి పండిత పుత్రులను ఆయన అత్యంత తీవ్రంగా మందలించాడు. మార్క్సిస్ట్ ఎడ్యుకేషన్ మాత్రమే శ్రామిక ప్రజల్ని చైతన్యవంతుల్ని గావించలేదనీ, దానికి చేదోడువాదోడుగా వారి అంధవిశ్వాసాల్ని నిర్మూలించే నాస్తిక ప్రచార సాహిత్యం సైతం వారికి అవసరమేనని లెనిన్ వక్కాణించాడు. చూడండి: 'It would be the biggest and most grievous mistake a marxist could make to think that the millions of the people (especially the peasants & artisans) who have been condemned by all modern society to darkness, ignorance and superstition, can extircate themselve from this darkness only along the straight line of a purely Marxist education. These masses should be supplied with the most varied atheist propaganda mat...
photo: businesstoday.in ఏ కొలబద్దతో చూసినా సగటు లేదా తలసరి ఆదాయంతో ఒక దేశంలోని పౌరుల సంక్షేమాన్ని కొలవడం సముచితం కాదు. అది తెలుసుకోవాలంటే మొత్తం ఆదాయం లేదా స్థూల దేశీయ ఉత్పత్తి (జి.డి.పి.) ఎలా పంపిణీ అవుతుందో చూడాలి అంశాన్ని కొంత విపులీకరించాలంటే పొంతనలేని రెండు పంపిణీ ఈ విధానాలున్న సమాజాలను చూడండి. మొదటి సమాజంలో పంపిణీ పూర్తి సమానంగా అంటే ఒక్కో వ్యక్తికి 23,000 రూపాయల ఆదాయం ఉంది జనాభా 100 ఉంది. ఈ పద్ధతిలో అయితే సగటు మనిషి ఆదాయాన్ని లెక్కించడానికి తలసరి ఆదాయం కచ్చితమైన కొలబద్ద. ఇక రెండో సమాజం గురించి చూడండి. 99 మంది బానిసలకు తలా వంద రూపాయల ఆదాయం మాత్రమే ఉన్న బానిస సమాజాన్ని ఊహించండి. మిగతా ఆదాయం అంతా ఒకే ఒక్క బానిస యజమానికి వెళుతుంది. యజమాని ఆదాయాన్ని ఇలా లెక్క కట్టవచ్చు : మొత్తం సమాజం ఆదాయం అంటే దాని జి.డి.పి. (100 మంది వ్యక్తులు X వ్యక్తికి 23,000 రూపాయలు). ఇందులో నుంచి 99 మంది బానిసల (99 X 100) మొత్తం ఆదాయాన్ని తీసివేయాలి. అంటే బానిస యజమాని ఆదాయం 22,90,100 అవుతుంది. అది ఒక బానిస ఆదాయం కన్నా 22.9 వేలరెట్లు ఎక్కువ బానిస సమ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి