గ్రామీణ స్థానిక సంస్థలు : స్థానిక సంస్థల ప్రతినిధుల ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ చేత నేరుగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతాయి. pc: eastgodavari.ap.gov.in జిల్లా పరిషత్ టెరిటోరియల్ నియోజకవర్గం (zilla parishad territorial constituency) pc: hansindia.com ZPTC సభ్యులు మండల పరిషత్ టెరిటోరియల్ నియోజకవర్గం ( mandal parishad territorial constituency – MPTC) సభ్యులు pc prajasakti.com గ్రామ పంచాయతీ సర్పంచ్ ( gram panchayat sarpanch ) గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యుడు. పట్టణ స్థానిక సంస్థలు : పట్టణ స్థానిక సంస్థలు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు మరియు నగర్ పంచాయతీలను కలిగి ఉంటాయి. మునిసిపల్ కార్పొరేషన్ యొక్క కార్పొరేటర్లు / వార్డ్ సభ్యులు మునిసిపాలిటీ / నగర్ పంచాయతీ కౌన్సిలర్లు / వార్డ్ సభ్యులు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ విధులు : ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తమ విధులు, బాధ్యతలను నిర్వర్తించాల్స...
సోవియట్ యూనియన్లో బోల్షివిక్ విప్లవం విజయవంతమయ్యాక అంతర్జాతీయ స్పిరిట్ విస్తృతంగా ఉన్న రోజుల్లో అందులో భాగంగా ఆరంభమైంది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 1920 అక్టోబర్ 17న తాష్కెంట్లో. దీని వ్యవ స్థాపనలో ఎంఎన్ రాయ్ కీలకపాత్ర పోషించారు. MNRoy ఎంఎన్ రాయ్, ఆయన సహచరి ఎవ్లిన్ ట్రెంట్ రాయ్, అబానీ ముఖర్జీ, రోసా ఫిటింగో, మహమ్మద్ ఆలీ, మొహమ్మద్ షపీఖ్, ఎంపీబీటీ ఆచార్యలు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను సోవియట్ యూనియన్లోని తాష్కెంట్లో ప్రకటించారు. ఇందులో ఎవ్లీన్ రాయ్ అమెరికన్ కమ్యూనిస్ట్, అబానీ ముఖర్జీ సహచరి అయినటువంటి రోసా రష్యన్ కమ్యూనిస్టు. మొహమ్మద్ అలీ, మొహమ్మద్ షఫీఖ్ టర్కీలో ఖలీఫా పాలనను పునరుద్ధరించడానికి భారత్లో సాగుతున్న ఖిలాఫత్ ఉద్యమం తరపున రష్యా మద్దతుకోసం వెళ్లిన వారు. ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీ కూడా మద్దతునిచ్చిన దశ. టర్కీకి మద్దతుగా అక్కడి బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా భారత్ నుంచి అనేకమంది ఉద్యమకారులు రోడ్డు మార్గాన మరీ ముఖ్యంగా కొందరు కాలినడకన సిల్క్ రూట్లో టర్కీ వెళ్లిన దశ. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సెకండ్ కాన్ఫరెన్స్ తర్వాత జరిగిన పరిణామమి...
*పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి*.. మనిషి సామాజిక సంబంధాల్లోనూ అతని సామాజిక జీవితంలోనూ మార్పులు వచ్చినప్పుడల్లా అతని భావాలూ , అభిప్రాయాలు కూడా మారిపోతుండటం మనం చూస్తూంటాం. అంటే అతని చుట్టూ ఉన్న జీవితం మారినప్పుడు అతని చైతన్యమూ మారుతుంది. సమాజాన్ని విప్లవీకరించే కొన్ని భావాలను జనం వ్యక్తం చేస్తున్నారంటే,పాత సమాజం లోనే కొత్త సమాజపు అంశాలు కొన్ని పుట్టాయని అర్ధం. పాత జీవన పరిస్థితులు అంతమౌతున్న కొద్దీ పాత భావాలు కూడా అంతరిస్తాయి. ప్రాచీన ప్రపంచం మరణ శయ్యపై ఉన్నపుడు అంతకుముందు ఉన్న మతాలను క్రైస్తవ మతం తనలో కలిపేసుకుని వాటిని పూర్తిగా కనుమరుగు చేసింది. భూస్వామిక సమాజం అంతమవుతున్న దశలో ఆనాటి విప్లవ పెట్టుబడిదారీ వర్గంతో అది చివరి పోరులో ఉంది.అది పద్దెనిమిదో శతాబ్దపు కాలం. ఆ సందర్భంలో హేతువాదానికి క్రైస్తవం తలొగ్గింది. పాలక వర్గం ఆలోచనలే ప్రతి యుగంలో సమాజాన్ని పాలించే భౌతిక శక్తి . ఉత్పత్తి సాధనాలపై ఎవరికి ఆధిపత్యం ఉంటుందో వారికే మానసిక ఉత్పత్తి సాధ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి