పోస్ట్‌లు

మేడే - నిర్దిష్టమైన విప్లవ క ర్తవ్యాలు.

* మేడే - నిర్దిష్టమైన విప్లవ క ర్తవ్యాలు. మేడే అంటే కేవలం అంతర్జాతీయ సౌహార్ద్రతను జనరల్ గా ప్రకటన చేయమని అర్ధంకాదని గూడా లెనిన్ కార్మికులకు చెప్పారు. ఆయా దేశాలలో కార్మికులు ఎదుర్కొంటున్న నిర్దిష్టమైన విప్లవ కర్తవ్యాలకు అంకితం కావాలి. విప్లవకర ప్రాధాన్యతగల తక్షణ ఆర్థిక కోర్కెలను, అంతర్జాతీయ సౌహార్దత సోషలిజంపట్ల జనరల్ గా వాంఛను కలిపి ప్రకటించడం సరిపోదు. సోషలిజం లక్ష్యాన్ని చేరుకునేందుకు, కార్మికవర్గం తాను ఎదుర్కొంటున్న నిర్దిష్ట విప్లవ సమస్యలను పట్టించుకోవాలి. అందువల్ల మేడే సభలలో పెట్టుబడి దారీ విధానానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో భాగంగా ఈ సమస్యలను లేవనెత్తడం అవసరం, ఇది 1902లో నార్తరన్ లీగ్ కు రాసిన తన లేఖలో లెనిన్ చెప్పింది. "మనదేశంలో మేడే ప్రదర్శనలు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, రాజకీయ స్వేచ్ఛకోనం జరిగే ప్రదర్శనగా గూడా తయారైందని గూడా చేర్చి వుండా ల్సింది. ఆ పవిత్ర దినం గురించిన అంతర్జాతీయ ప్రాధాన్యతను ఎత్తి చూపడంతో సరిపోదు, దానిని కీలకమైన జాతీయ రాజకీయ డిమాండ్లతో జత చేయాలి. (సంపూర్ణ రచనలు 6వ భాగం పేజీ 168. 1903లో రానున్న మేదే సందర్భంలో సహితం లెనిన్ అదే అంశాన్ని నొక్కి చెప్పారు. ...

కారల్‌ మార్క్స్

చిత్రం
మార్చి14కారల్‌ మార్క్స్‌ వర్థంతి ----------------------------  మానవ చరిత్ర మలుపుల గుట్టు విప్పిన మహోన్నతుడు’ కారల్‌ మార్క్స్‌ వర్థంతి మార్చి14 మానవ జాతి చరిత్ర అంతా అతీత శక్తుల, పుణ్యపురుషుల సృష్టింగా గోషిస్తుంటే మానవుడే చరిత్ర నిర్మత అన్న మహోన్నత వ్యక్తి కారల్‌ మార్క్స్‌ . ప్రకృతిలోని సకల జీవకోటికి భిన్నంగా మానవుడు పరికరాలు ఉత్పత్తి చేసి ప్రకృతిని తనకు బానిసగా చేసుకొని మానవ చరిత్రను తానే నిర్మించాడని మార్క్స్ ఉద్బోధించాడు .చారిత్రక భౌతిక వాదంతో గత చరిత్రనే కాదు భవిష్యత్ ఎలా నడుస్తుందో వివరించి చెప్పిన మహోన్నతుడు. అద్భుతమైన అధ్యయనంతో అనితర సాధ్యమైన కృషితో మానవజాతిని ప్రభావితం చేశాడు.    మరణించి 131 ఏళ్ళు లైనా ప్రపంచాని ప్రభావితం చేస్తూనే వున్నాడు. ఆయన చూపిన మార్గంలో కోటాను కోట్ల మంది పయనిస్తూనే వున్నారు.  మార్క్స్ జీవించి నాటిక ప్రపంచ పరిస్థితి  అప్పటికి వెనుకబడివున్న ఐరోపాఖండంలో ‘‘ఫూడలిజం’’కు వ్యతిరేకంగా సాగిన పోరాటాలు కొత్తసమాజ నిర్మాణానికి బాటలువేశాయి. ఈ పోరాటాలు14వ శతాబ్దం నుండి సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలే వేశాయి. 1455లో గూటెన్‌బర్గ్...

ఐక్యపోరాటాలు

*🚩ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో ఐక్యపోరాటాలకు పునరంకితమవుద్దాం!🚩*♦️♦️♦️♦️♦️ *భారతదేశంలో జాతీయోద్యమం, కార్మికోద్యమం పెనవేసుకొనే సాగాయి.ఏఐటియుసి ఏర్పడ్డ ప్రారంభ దినాల్లో జాతీయోద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులే ఆ తరువాత ఏఐటియుసికి నాయకత్వం వహించారు. బి.టి.రణదివే,పి.రామ్మూర్తి, డాంగే,ఘాటే వంటి ఎందరో కమ్యూనిస్టు నాయకులు కూడా కీలక పాత్ర పోషించారు. అందుకనే ఇటు జాతీయోద్యమంలోనూ,అటు కార్మికోద్యమంలోనూ మిలిటెంట్‌ పోరాటాల ఉధృతి సాగింది.* 1920 లో ఏర్పడ్డ                    ఏఐటియుసి కార్మిక సంస్థను భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి మూడునెలల ముందు ఏఐటియుసిలో చీలికలకు కాంగ్రెస్‌ పార్టీ పావులు కదిపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికి పాత్రధారి, సూత్రధారుడు.1947 జూన్‌లో  ఐ ఎన్ టి యు సి ఏర్పడింది. దీంతో ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చీలికలు ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత 1948లో హిందూ మజ్దూర్‌ సభ ఏర్పడింది. 1948లో యుటియుసి, 1955లో భారతీయ మజ్దూర్‌ సంఘ్ (బిఎంఎస్‌),1958లో యుటియుసి లెనిన్‌ సారాని తదితర కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి.కాల క్రమేణా ఏఐటియుసి .పాలకవర్గ స్వ...

భవిష్యత్ సోషలిజానిదే

మే 19న పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ప్రతి మండలంలో బహిరంగ అధ్యయన వేదిక ద్వారా భవిష్యత్ సోషలిజానిదే అని మనం శపదం చేద్దాం. పోరాటాల ద్వారా ఒక అడుగు ముందుకు వేద్దాం. ప్రతీ క్షణం ప్రజాతంత్ర ఉద్యమ అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలతో మమేకం అవుతూ విప్లపకర ఉద్యమాన్ని నిర్మిద్దాం. తద్వారా.. సోషలిజాన్ని సాధిద్దాం. అప్పుడే కామ్రేడ్ సుందరయ్య ఆశయాన్ని నెరవేర్చిన వాళ్ళమవుతాం. సోవియట్ రష్యా సాధించిన ప్రగతి - విజయాలు : ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, ఇతర శ్రమ చేసే ఇతర తరగతుల ప్రజలు నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా, పొదుపు చర్యలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. వీరందరికీ  1917 సోషలిస్ట్ విప్లవం దిశానిర్ధేశం చేసే వెలుగుకిరణం. ప్రగతిశీల విప్లవశక్తులకు అక్టోబర్ విప్లవం ప్రేరణ నిచ్చే ఆశాకిరణం, వర్గరహిత, దోపిడీరహిత సమాజం కోసం కృషి చేసే వారందరికీ అక్టోబర్ విప్లవం భవిష్యత్ సోషలిజానిదే అన్న సందేశాన్ని ఇస్తున్నది.  1917లో రష్యాలో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది. కార్మికవర్గ నాయకత్వాన విప్లవోద్యమాన్ని ప్రపంచపటం మీదికి తె...

సోషలిజం భవిష్యత్తు

ప్రపంచ రాజకీయ చిత్రపఠంలో పెట్టుబడిదారీ విధానం అమలు చేస్తున్న దేశాలున్నాయి. అలాగే సోషలిస్ట్ విధానం అమలు చేస్తున్న దేశాలు ఐదు ఉన్నాయి. 5 దేశాల్లో (చైనా, క్యూబా, వియత్నాం, డెమోక్రటిక్ రిపబ్లిక్ కొరియా (ఉత్తర కొరియా), లావోస్) కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సోషలిస్టు ప్రభుత్వాలు పని చేస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆర్థిక మాంద్యం, సంక్షోభం, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలతో ముందుకు నడుస్తున్నాయి. వేగుచుక్కగా ఉన్నాయి. కోవిడ్, ఆర్థిక సంక్షోభంలో ఎదుర్కొన్న తీరు చూసి ఐ.ఎం.ఎఫ్ ప్రతినిధులు కూడా సోషలిస్ట్ దేశాల కృషిని శ్లాఘించాయి, (1) సోషలిజం అంటే ఏమిటీ ? : సోషలిజం అనగా ఉత్పత్తి సాధనాలు వ్యక్తుల చేతుల్లో నుండి జాతీయం చేయబడి ప్రభుత్వ ఆస్తిగా మారుతుంది. భూమి, ఖనిజాలు, ఫ్యాక్టరీలు, నదులు సమస్తము ప్రభుత్వం చేతుల్లో ఉండటమే సోషలిజం. సోషలిస్టు ఆర్ధిక వ్యవస్థలో ఉత్పత్తి శక్తులకు యజమాని కార్మిక వర్గమే. కనుక సంపద అంతా సమాజానికే చెందుతుంది. శ్రామిక ప్రజల అవసరాలు తీర్చడానికి సంపదను వినియోగించడం జరుగుతుంది. మిగులు...

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..

*పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి*.. మనిషి సామాజిక సంబంధాల్లోనూ అతని సామాజిక జీవితంలోనూ మార్పులు వచ్చినప్పుడల్లా అతని భావాలూ , అభిప్రాయాలు కూడా మారిపోతుండటం మనం చూస్తూంటాం. అంటే అతని చుట్టూ ఉన్న జీవితం మారినప్పుడు అతని చైతన్యమూ మారుతుంది.            సమాజాన్ని విప్లవీకరించే కొన్ని భావాలను జనం వ్యక్తం చేస్తున్నారంటే,పాత సమాజం లోనే కొత్త సమాజపు అంశాలు కొన్ని పుట్టాయని అర్ధం. పాత జీవన పరిస్థితులు అంతమౌతున్న కొద్దీ పాత భావాలు కూడా అంతరిస్తాయి.       ప్రాచీన ప్రపంచం మరణ శయ్యపై ఉన్నపుడు అంతకుముందు ఉన్న మతాలను క్రైస్తవ మతం తనలో కలిపేసుకుని వాటిని పూర్తిగా కనుమరుగు చేసింది. భూస్వామిక సమాజం అంతమవుతున్న దశలో ఆనాటి విప్లవ పెట్టుబడిదారీ వర్గంతో అది చివరి పోరులో ఉంది.అది పద్దెనిమిదో శతాబ్దపు కాలం. ఆ సందర్భంలో హేతువాదానికి క్రైస్తవం తలొగ్గింది.        పాలక వర్గం ఆలోచనలే ప్రతి యుగంలో సమాజాన్ని పాలించే భౌతిక శక్తి .    ఉత్పత్తి సాధనాలపై ఎవరికి ఆధిపత్యం ఉంటుందో వారికే  మానసిక ఉత్పత్తి సాధ...

ఒక జాతి మరో జాతిని దోపిడీ చెయ్యడం అంతమవుతుంది

ఒక జాతి మరో జాతిని దోపిడీ చెయ్యడం అంతమవుతుంది. దేశాలనూ జాతీయతనూ రద్దుచేయగోరుతున్నారు అన్నది కమ్యూనిస్టుల పై మరో ఆరోపణ. కార్మికులకు దేశం లేదు. వారి నుంచి వారి దగ్గర లేనిదాన్ని ఎవరూ లాక్కోలేరు. అన్నింటికంటే ముందు శ్రామికవర్గం రాజకీయ ఆధిపత్యాన్ని సాధించాలి; కనుక జాతిలో అది ప్రధాన వర్గం కావాలి. జాతి అంటే తానే అన్న స్థితికి రాక తప్పదు. ఆ మేరకు మాత్రమే అది జాతీయమైనది. కనుక, ఇక్కడ జాతీయం అన్న పదం బూర్జువా అర్ధంలో కాదు. బూర్జువా వర్గ అభివృద్ధి కారణంగా, స్వేచ్ఛా వాణిజ్యం వల్లనూ, ప్రపంచ మార్కెటు వల్లనూ, ఉత్పత్తి విధానంలోనూ దాన్ని అనుసరించి వుండే జీవన పరిస్థితుల్లోనూ ఏకరూపత వల్లనూ వివిధ దేశాల ప్రజల మధ్య జాతీయ భేదాలూ శత్రుత్వాలూ రాను రాను మాయమవుతున్నాయి. శ్రామికవర్గ ఆధిపత్యంలో అవి మరింత వేగంగా మాయమవుతాయి. కనీసం ప్రధాన నాగరిక దేశాల ఐక్క ర్యాచరణ అన్నది శ్రామికవర్గ విమోచనకు మొదటి షరతుల్లో ఒకటి. ఒక వ్యక్తి మరో వ్యక్తిని దోపిడీ చేయడం అన్నది ఏ మేరకు అంతమౌతుందో ఒక జాతి మరో జాతిని దోపిడీ చెయ్యడం కూడా అదే మేరకు అంతమవుతుంది. ఒక జాతిలో వర్గ శత్రుత్వం ఏమేరకు మాయమవుతుందో ఒక జాతికీ మరో జాతికీ మధ్య శత్రుత్వం కూడ...