'షైనింగ్ ఇండియా' రాగం అపశృతులు
pc: Getty images 2003-04 రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం వాజ్పేయి పాలన లో సేవింగ్స్ ఖాతాల్లో 17 శాతం పెరుగుదల నమోదైంది. పీవీ-మన్మోహన్ జోడీ ఉదారవాద ఆర్థికసంస్కరణలను వాజ్పేయి ప్రభుత్వం కొనసాగించింది దానికి 'ఆర్థిక సంస్కరణల ట్రాక్-టూ' అనే పేరు పెట్టారు.అది జిలుగుల ఎకానమీ అని సంఘ్ పరివార్ దానిని వ్యతిరేకించింది. బీఎంఎస్-స్వదేశీ జాగరణ్ మంచ్ దేశ ఆర్థికసంస్కరణలను సమర్థించాయి. వాజ్పేయి ప్రభుత్వానికి ముందు నుయ్యి, వెనుక గొయ్యి పరిస్థితి. దాంతో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తన పదవి వీడాల్సి వచ్చింది. కానీ ఆర్థిక సంస్కరణలతో నాట్యం చేేేేసిన వాజ్పేయి ప్రభుత్వం 'షైనింగ్ ఇండియా' రాగం అందుకుంది. అయినా, వాజ్పేయి ఎన్నికల్లో ఓడిపోయారు. వాజ్పేయి కాలంలోని ఆర్థిక సంస్కరణలను వామపక్షాల మద్దతుతో ఏర్పడిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కొనసాగించింది. (బిబిసి.కామ్ ఆధారంగా)